విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభం ఎప్పుడో తేల్చిన మంత్రి వెల్లంపల్లి: కేశినేని నాని, గద్దె దద్దమ్మలుగా

|
Google Oneindia TeluguNews

విజయవాడ: విజయవాడలో రోజురోజుకూ పెరిగిపోతున్న వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించడానికి ఉద్దేశించిన దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం శరవేగంగా కొనసాగుతోందని జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. 95 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. వచ్చేనెల ఆగస్టు 15వ తేదీ నాటికి మిగిలిన పనులను పూర్తి చేస్తామని అన్నారు. అదే నెల 30వ తేదీన ఫ్లైఓవర్‌ను వాహనదారుల కోసం అందుబాటులోకి తీసుకుని వస్తామని స్పష్టం చేశారు.

మరో మాజీమంత్రి అరెస్టు తప్పదా? టీడీపీలో వర్గపోరు: సీనియర్ నేత హత్యకు కుట్ర: ఎస్పీకి చేరినమరో మాజీమంత్రి అరెస్టు తప్పదా? టీడీపీలో వర్గపోరు: సీనియర్ నేత హత్యకు కుట్ర: ఎస్పీకి చేరిన

దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి అప్పుడెప్పుడో చంద్రబాబు హయాంలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన పడిందని, తన హయాంలో చంద్రబాబు దీన్ని పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. రెండున్నర కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ ఫ్లైఓవర్‌ను కృష్ణా పుష్కరాల నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించిన చంద్రబాబు.. సకాలంలో ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు.

Durgagudi flyover in Vijayawada will be made available to the public by August 30

రాష్ట్రపతి వద్దకు వెళ్లి తమ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన స్థానిక ఎంపీ కేశినేని నానికి.. దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణంలో చోటు చేసుకున్న జాప్యం కనిపించలేదా? అని నిలదీశారు. సకాలంలో పూర్తి చేయలేకపోవడానికి చంద్రబాబు ఒక్క రూపాయి కూడా నిధులను మంజూరు చేయకపోవడమే కారణమని విమర్శించారు. సకాలంలో నిధులు మంజూరు చేయకుండా అయిదేళ్లు కాలక్షేపం చేశారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే విజయవాడలో ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగాయని చెప్పారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. విజయవాడలో ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి ప్రాధాన్యత ఇచ్చామని, దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వేగవంతం చేశామని అన్నారు. దీనికి అదనంగా బెంజ్ సర్కిల్‌లోనూ ఫ్లైఓవర్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. కనీసం దుర్గుగడి ప్లైఓవర్‌ నిర్మాణాన్ని పూర్తి చేయలేని చంద్రబాబు అమరావతిని నిర్మిస్తారంటే ఎలా విశ్వసిస్తామని అన్నారు. విజయవాడలో ట్రాఫిక్ ఇబ్బందులను తీర్చలేని కేశినేని నాని, గద్దె రామ్మోహన్ వంటి టీడీపీ నాయకులు ఇంట్లో తాగి పడుకున్న దధ్దమ్మలని ధ్వజమెత్తారు.

English summary
The Andhra Pradesh Endowment minister Vellampalli Srinivas told that the Durgagudi flyover in Vijayawada will be completed by August 15 and made available to the public by August 30. He was inspected the Durgagudi flyover works and given assurance to the complete the flyover.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X