ఒంగోలులో భూకంపం, ఇళ్లనుంచి పరుగులుతీసిన జనం..
ప్రకాశం జిల్లా ఒంగోలులో భూమి స్వల్పంగా కంపించింది. శుక్రవారం ఉదయం భూమి స్వల్పంగా కంపించడంతో జనం ఆందోళనకు గురయ్యారు. కొన్ని సెకన్లపాటు ప్రకంపనలు కొనసాగాయి. ఇళ్ల నుంచి జనం బయటకు పరుగులు తీశారు. తర్వాత ప్రకంపనలు తగ్గిపోవడంతో.. జనం ఊపిరి పీల్చుకున్నారు.
Recommended Video
శర్మ కాలేజీ, అంబేద్కర్ భవన్, గద్దలకుంట, మామిడిపాలెం, దేవుడి చెరువులో భూమి కంపించింది. తర్వాత ఆగిపోయిందని స్థానికులు చెబుతున్నారు. కానీ కాసేపు తాము ఆందోళనకు గురయ్యాయని చెబుతున్నారు. రెండు సెకన్ల పాటు భూమి కంపించిందని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు కర్ణాటక, జార్ఖండ్లోనూ భూకంపం వచ్చింది. ఉదయం 6.55 గంటలకు జార్ఖండ్ జంషెడ్పూర్లో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.7గా ఉంది. ఇటు కర్ణాటకలోని హంపిలోనూ భూకంపం సంభవించింది. దీని తీవత్ర 4గా నమోదైంది. దీంతో అక్కడ కూడా జనాలు భయాందోళనకు గురయ్యారు.