రాజమండ్రిలో భారీ అగ్నిప్రమాదం...60 పూరిళ్లు దగ్ధం;భారీగా ఆస్థి నష్టం
తూర్పుగోదావరి:రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరు జంగాల కాలనీలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 60 పూరి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి.
తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించడంతో బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపు చేసేలోగానే పూరిళ్లు కావడంతో దగ్థమైపోయాయి. దీంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం లేకున్నా భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్సర్క్యూట్ చోటుచేసుకున్న కారణంగానే మంటలు వ్యాపించినట్లు భావిస్తున్నారు.
Comments
andhra pradesh east godavari rajahmundry fire accident property damage short circuit ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి రాజమండ్రి అగ్ని ప్రమాదం దగ్ధం షార్ట్ సర్క్యూట్
English summary
East Godavari:About 60 huts were gutted in an fire accident after a broke out in one of them at Kontamuru jangala colony in Rajahmundry, Andhra Pradesh on Monday morning.
Story first published: Monday, October 29, 2018, 9:17 [IST]