ఏపీలో మొత్తం 3.99 లక్షల ఓటర్లు.. తుది జాబితా విడుదల చేసిన ఈసీ
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల సంఖ్య పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సవరించిన తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. ఆ లెక్కల ప్రకారం ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 99 లక్షల 37 వేల 394 మందిగా తేలింది. అదులో పురుష ఓటర్లు కోటీ 97 లక్షల 21 వేల 514 కాగా.. మహిళా ఓటర్లు 2కోట్ల 2 లక్షల 4 వేల 378 మంది అని వెల్లడైంది.
ఎన్ఆర్ఐ,
ట్రాన్స్జెండర్లు..
సవరించిన
ఓటర్ల
జాబితాలో
విడివిడిగా
పురుషులు,
మహిళల
సంఖ్యతోపాటు
ట్రాన్స్జెండర్
ఓటర్ల
సంఖ్యను
కూడా
ప్రత్యేకంగా
పేర్కొన్నారు.
ఏపీలో
ట్రాన్స్జెండర్
ఓటర్ల
సంఖ్య
4,066గా
నమోదైంది.
ఎన్ఆర్ఐ
ఓటర్లు
7,436
ఉన్నారని
ఈసీ
తెలిపింది.
ముసాయిదా
జాబితా
తర్వాత
కొత్తగా
లక్షా
63
వేల
30
మంది
ఓటర్లు
నమోదయ్యారని
రాష్ట్ర
ఎన్నికల
ప్రధానాధికారి
విజయానంద్
వెల్లడించారు.
పకడ్బందీ
ఏర్పాటలు..
మార్చి
15లోగా
స్థానిక
సంస్థల
ఎన్నికలు
నిర్వహించాలని
ఏపీ
కేబినెట్
నిర్ణయించిన
నేపథ్యంలో
ఆ
మేరకు
రాష్ట్ర
ఎన్నికల
సంఘం
ఏర్పాట్లలో
నిమగ్నమైంది.
స్థానిక
సంస్థల
ఎన్నికలకు
మొత్తం
45,836
పోలింగ్
కేంద్రాలను
ఏర్పాటు
చేయనున్నట్లు
విజయానంద్
తెలిపారు.
అటు
రాజకీయ
పార్టీలు
కూడా
అభ్యర్థుల
ఎంపికలో
తనమునకలయ్యాయి.