హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేప్ నిందితుడికి శాస్తి, ఇఫ్లూ విద్యార్థినిపై హాస్టల్లోనే, అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 EFL University post-graduate student raped
మహబూబ్ నగర్/హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్లు మండలంలోని మంగలపల్లిలో శనివారం రాత్రి ఆరేళ్ల చిన్నారి పైన అత్యాచారానికి పాల్పడిన నిందితుడు రఫీక్ ఇంటిని ఆదివారం గ్రామస్థులు కూల్చేసి నిప్పంటించారు. గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆమనగల్లు పట్టణానికి వెళ్లి శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారి పైన గంటన్నరపాటు ధర్నా చేశారు. పోలీసులు వచ్చి నిందితుడి పైన నిర్భయ కేసును నమోదు చేసినట్లు తెలిపారు. బీజేపీ టీడీపీ, తెరాస, కాంగ్రెస్, పలు విద్యార్థి, మహిళా, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి.

ఇఫ్లూ ఘటన: హాస్టల్‌లోనే దారుణం

ఇంగ్లీష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు విద్యార్థులు తోటి విద్యార్థినిపై అత్యాచారం చేశారు. నాలుగు నెలల క్రితం ఇదే వర్సిటీ క్యాంపస్‌లో ఓ విద్యార్థి తన సహ విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించిన సంఘటన మరువక ముందే ఈ సంఘటన చోటు చేసుకోవడం విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తోంది.

24 గంటల తర్వాత ఆదివారం వెలుగు చూసిన ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఢిల్లీకి చెందిన ఓ విద్యార్థిని ఉన్నత విద్య కోసం నగరానికి వచ్చి ఇఫ్లూలో ఎంఏ (ఇంగ్లిష్‌) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. క్యాంపస్‌లో ఉన్న హాస్టల్‌లోనే ఉంటోంది.

అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన నితిన్‌ సోలసముద్రం(22) ఇక్కడే ఎంసీజే మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అక్టోబరు 31న క్యాంపస్‌లోని బషీర్‌ హాస్టల్‌లో ఉండే తన స్నేహితురాలి గదికి బాధిత విద్యార్థిని వచ్చింది. ఆమె ఇతరులతో కలిసి చదువుకుంటుండటంతో తిరిగి తన గదికి తిరిగి వెళుతోంది. ఈ సమయంలో ఇఫ్లూలోనే ఎంసీజే చదువుతున్న నితిన్‌ మెట్ల వద్ద ఎదురై ఆమెను తన గదికి తీసుకెళ్లాడు.

అప్పటికే ఆ గదిలో ఇఫ్లూలో ఎంసీజే పూర్తి చేసి బాగ్‌లింగంపల్లిలోని ఎంఐజీ-2 బ్లాక్‌-8లో నివాసముంటున్న పశ్చిమ గోదావరి జిల్లా మల్కిపురానికి చెందిన రాజసింహ(24) ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఆమెతో సిగరెట్‌ తాగారు. ఆమెకు మత్తు మందు ఇచ్చి అపస్మారక స్థితిలో ఉండగానే, ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు. మరునాడు ఉదయం మెలకువ వచ్చిన ఆమె, తన గదికి వెళ్లి తోటి విద్యార్థినులతో విషయాన్ని చెప్పింది.

అందరూ కలిసి ఓ అధ్యాపకురాలి సాయంతో వర్సిటీ వీసీకి సమాచారం అందించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారించి, వారిలో నితిన్‌, రాజసింహపై ఐపీసీ 341, 376-జీ(నిర్భయ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సెల్ ఫోన్ల పైన నిఘాతో బాగ్ లింగంపల్లిలో ఉండగా ఆదివారం సాయంత్రం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాచార ఘటనకు ముందు గదిలో ఉన్న మరో వారిని పోలీసు స్టేషన్‌కు తీసుకు వచ్చారు.

English summary
In a shocking incident, a post-graduate student was allegedly raped by her male friends at English and Foreign Languages University in Hyderabad on Sunday. The 23 year old girl has approached the city police alleging that her friends intoxicated her and raped her in the boy’s hostel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X