దివ్యంగుల కోసం ఎన్నికల సంఘం ఉచిత రవాణ
అమరావతి: ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఉపయోనించుకోవడానికి వీలుగా ఎన్నికల కమిషన్ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వరకు వెళ్లలేని దివ్యంగుల కోసం ఉచిత రవాణా వసతిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎంపిక చేసిన కొన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో ఆటోలు, ఇతర వాహనాల వసతిని కల్పించారు. ఉచిత వాహన వసతిని వినియోగించుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.
దివ్యంగులు, నడవలేని స్థితిలో ఉన్న వయోధిక వృద్దులు ఉచిత రవాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అధికారులు ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలో సుమారు 83 వేల మందికిపైగా దివ్యంగుల ఓటర్లు ఉన్నట్లు సమాచారం. దీనితో పాటు- దివ్యంగులకు సహకరించడానికి వాలంటీర్లను నియమించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటును వేయడానికి వీలుగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు.
అయిదేళ్లకు ఒకసారి వచ్ఛే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాల్సిన అవసరం ఉందని ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది సూచించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణాన్ని కల్పిచామని అన్నారు. ఎవరి ఒత్తిళ్లకు, అలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.