గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కృష్ణా నదిలో దూకి ఈవో అనిత ఆత్మహత్య: మానసిక ఒత్తిడే కారణమా?

|
Google Oneindia TeluguNews

అమరావతి: గుంటూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. కృష్ణా నదిలో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు జిల్లా పొందుగలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలిని దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఈవో అనితగా పోలీసులు గుర్తించారు.

దైదా ఆలయంతోపాటు గురజాలలో మరో గుడికి కూడా అనిత ఈవోగా పనిచేస్తున్నారు. అయితే, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే కారణంతో ఆమెను నవంబర్ 18న ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గురజాల ఆలయ లెక్కల్లో తేడా రావడంతోనే అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.

EO Anitha committed suicide in Guntur district

ఈ వ్యవహారంలో విచారణకు కూడా ఆదేశించినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే, భర్తతో కూడా అనితకు ఈ మధ్య కాలంలో గొడవలు జరగడంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అనిత ఆత్మహత్యకు పాల్పడిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. అనిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం స్పందిస్తామని చెప్పారు. ప్రస్తుతం అనితది అనుమానాస్పాద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

English summary
EO Anitha committed suicide in Guntur district on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X