హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఆర్ఎస్‌లో అంతర్గత పోరు: ఎర్రబెల్లి, 'మూడో ఉగ్రవాది ఎక్కడున్నాడో తెలియదు'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో అంతర్గత పోరు కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే రెండు సంవత్సరాల్లో ఆ పార్టీ విచ్ఛిన్నమవడం ఖాయమని అన్నారు.

రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గపు పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఎర్రబెల్లి జోస్యం చెప్పారు. ఈనెల 23న జరిగనున్న బహిరంగ సభకు భారీగా కార్యకర్తలు తరలివచ్చి తెలుగుదేశం సత్తా చాటాలన్నారు.

 Errabelli Dayakar Rao says internal conflicts in trs party

సూర్యాపేట కాల్పులు: 'మూడో నిందితుడి ఆచూకీ దొరకలేదు'

నల్గొండ జిల్లాలోని సూర్యాపేట కాల్పుల ఘటనకు సంబంధించి మూడో నిందితుడి ఆచూకీ ఇంకా దొరకలేదని హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి పేర్కొన్నారు. సెక్రటేరియట్‌లో కొద్దిసేపటి క్రితం ఆయన 'పోలీస్ టైగర్' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట కాల్పుల ఘటనలో తప్పించుకున్న మూడో ఉగ్రవాది జాడ ఇంకా తెలియలేదని చెప్పారు. ఆ ఉగ్రవాదికోసం కాలింపు కొనసాగుతోందని ఆయన తెలిపారు. నల్గొండ జిల్లాలోని జానకీపురం ఎన్‌కౌంటర్‌‌పై విచారణ కొనసాగుతోందని నాయిని పేర్కొన్నారు.

English summary
Errabelli Dayakar Rao says internal conflicts in trs party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X