వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేతగాని పోటుగాడు సీఎం జగన్ .. అఖిల పక్షం పెట్టి ఆ లెక్కలు చెప్పాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సవాల్

|
Google Oneindia TeluguNews

టిడిపి నేత ,మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దమ్ముంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అయ్యన్నపాత్రుడు ఏపీ సీఎం జగన్ కు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు , ఆర్థిక శాఖ కార్యదర్శికి సవాల్ విసిరారు. అసలు ప్రభుత్వం వద్ద డబ్బులు ఉన్నాయా ? ఆదాయం ఎంత ? ఖర్చు ఎంత ? చెప్పగలరా అంటూ నిలదీశారు.

మీరు ఫోకస్ పెట్టారు రాష్ట్రం కనుమరుగవుతోంది .. సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల వ్యంగ్యంమీరు ఫోకస్ పెట్టారు రాష్ట్రం కనుమరుగవుతోంది .. సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల వ్యంగ్యం

జగన్ తీరుతో రాష్ట్రమంతా అడుక్కు తింటుంది

జగన్ తీరుతో రాష్ట్రమంతా అడుక్కు తింటుంది

డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు అంటూ ప్రశ్నించారు. జగన్ తీరుతో రాష్ట్రమంతా అడుక్కు తింటుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చేస్తే ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు. ఆర్థిక శాఖ మంత్రి, కార్యదర్శులతో పాటు, సీఎం జగన్మోహన్ రెడ్డి అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై మాట్లాడగలరా అంటూ సవాల్ విసిరారు అయ్యన్నపాత్రుడు. అంతేకాదు సీఎం జగన్ దోపిడీలో నంబర్ వన్ , దానిలో అనుమానం లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఒక దొంగ సీఎం అయితే ఎలా ఉంటుందో రాష్ట్రంలో చూస్తున్నాం

ఒక దొంగ సీఎం అయితే ఎలా ఉంటుందో రాష్ట్రంలో చూస్తున్నాం


ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని , కానీ ప్రభుత్వ తీరు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని అయ్యన్న వ్యాఖ్యానించారు . పనికిమాలిన చేతగాని పోటుగాడు సీఎం జగన్ అంటూ అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామతీర్థం ఘటనను సీఎం జగన్ ఖండించకపోవడం దారుణమని ఇది దుర్మార్గపు చర్య అని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఒక దొంగ సీఎం అయితే ఎలా ఉంటుందో రాష్ట్రంలో చూస్తున్నామని విమర్శించారు.

 ఆలయాల్లో విగ్రహ ధ్వంసాలు, దాడులపై అయ్యన్న ఆగ్రహం

ఆలయాల్లో విగ్రహ ధ్వంసాలు, దాడులపై అయ్యన్న ఆగ్రహం

దొంగ లెక్కలు చెప్పటంలో ఎంపీ విజయసాయిరెడ్డి ఘనాపాటి అంటూ విజయసాయి రెడ్డిని సైతం టార్గెట్ చేశారు. ఇక మాన్సస్ చైర్పర్సన్ సంచయిత గురించి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆమె రామతీర్ధంలో విగ్రహ ధ్వంసం ఘటనపై స్పందించకపోవడం దారుణమన్నారు. అశోకవనంలో ఆమె గంజాయి మొక్క అని అభివర్ణించారు అయ్యన్నపాత్రుడు. రాష్ట్ర వ్యాప్తంగా 125 దేవాలయాలపై దాడులు జరిగితే డిజిపి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించిన అయ్యన్నపాత్రుడు, వైసిపి హయాంలో రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని విమర్శించారు

English summary
TDP leader and former minister Ayyannapatrudu has lashed out at AP CM Jagan Mohan Reddy's administration. He also challenged AP CM Jagan, Finance Minister Buggana Rajendranath and Finance Secretary to convene an all-party meeting on the state's financial situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X