వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీమంత్రి పరిటాల సునీతకు పితృవియోగం, కొండంత అండను కోల్పోయిన కుటుంబం, నారా లోకేశ్..

|
Google Oneindia TeluguNews

టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పరిటాల సునీతకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి ధర్మవరపు కొండన్న శనివారం ఉదయం చనిపోయారు. గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మాజీమంత్రి పరిటాల రవీంద్ర చనిపోయిన తర్వాత సునీత కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. కొండన్న మృతితో పరిటాల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కొండన్న మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా సంతాపం తెలిపారు. పరిటాల సునీత కుటుంబానికి కొండంత అండగా నిలిచిన కొండన్న మృతి తీరనిలోటు అని నారా లోకేశ్ అన్నారు. కొండన్న ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు. సునీత, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇటు టీడీపీ కార్యకర్తలు కూడా పరిటాల కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.

ex minister paritala sunitha father kondanna passed away..

Recommended Video

Nepal Communist Party లో సంక్షోభం, భారత్ వ్యతిరేక కుట్రలపై ఆగ్రహం

నసనకోట ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్‌గా కొండన్న సుదీర్ఘకాలం పనిచేశారు. అనంతపురం జిల్లాలో ఎక్కువమంది సందర్శించే ఆలయాల్లో ఇదీ ఒకటి. ఆలయ ప్రాంతాన్ని అభివృద్ది చేసి, మంచి పేరు సంపాదించారు. ఆలయం పురాతనమైన... పరిటాల కుటుంబం మాత్రం మరింత అభివృద్ది చేయగా.. అమలు చేసింది మాత్రం ధర్మవరపు కొండయ్యే అని స్థానికులు చెబుతుంటారు.

English summary
ex minister paritala sunitha father kondanna passed away.tdp chief chandra babu nadu, nara lokesh condolence to death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X