వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ప్రారంభమైన బీజేపీ గేమ్..!? మాజీ ఎంపీ కొత్తపల్లి గీతతో స్టార్ట్.. ? నెక్స్ట్ ఎవరు ?

|
Google Oneindia TeluguNews

బీజేపీ ఏపీలో చేరికలకు శ్రీకారం చుట్టింది. తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చెయ్యాలని భావిస్తున్న బీజేపీ అందులో భాగంగా పావులు కదుపుతుంది. టీడీపీ నుండి, కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరే వారిపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా వలసలు స్టార్ట్ అయ్యాయి . అరకు మాజీ ఎంపీ, జనజాగృతి పార్టీ అధ్యక్షురాలు కొత్తపల్లి గీత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఏపీ అసెంబ్లీపై వర్మ షాకింగ్ ట్వీట్.. స్పీకర్ హెడ్ మాస్టర్ , ఎమ్మెల్యేలు స్కూల్ పిల్లల్లటఏపీ అసెంబ్లీపై వర్మ షాకింగ్ ట్వీట్.. స్పీకర్ హెడ్ మాస్టర్ , ఎమ్మెల్యేలు స్కూల్ పిల్లల్లట

బీజేపీలో చేరిన మాజీ ఎంపీ కొత్తపల్లి గీత .. జనజాగృతి పార్టీ బీజేపీలో విలీనం

బీజేపీలో చేరిన మాజీ ఎంపీ కొత్తపల్లి గీత .. జనజాగృతి పార్టీ బీజేపీలో విలీనం

న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కొత్తపల్లి గీత బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అంతే కాదు ఆమె గత ఏడాది ఆమె స్థాపించిన జనజాగృతి పార్టీని కూడా బీజేపీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు కొత్తపల్లి గీత. అంతకుముందు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో ప్రత్యేకంగా భేటీ అయిన ఆమె ఇక తానుబీజేపీలో చేరే అంశం, పార్టీ విలీనంతోపాటు భవిష్యత్ లో తనకు న్యాయం చేయాలంటూ రామ్ మాధవ్ ను కోరినట్లు తెలుస్తోంది. అనంతరం రామ్ మాధవ్ నేతృత్వంలో అమిత్ షా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. కమలం గూటికి చేరారు.

Recommended Video

కమలం గూటికి అరకు మాజీ ఎంపీ
వైసీపీ నుండి టీడీపీకి ఫిరాయించిన ఎంపీ .. టికెట్ రాక సొంత పార్టీ పెట్టి ఓటమి పాలైన గీత

వైసీపీ నుండి టీడీపీకి ఫిరాయించిన ఎంపీ .. టికెట్ రాక సొంత పార్టీ పెట్టి ఓటమి పాలైన గీత

2014 ఎన్నికల్లో కొత్తపల్లి గీత జగన్ పార్టీ అయిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అరకు లోక్ సభ ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఫిరాయింపులలో భాగంగా కొత్తపల్లి గీత టీడీపీకి వైపు ఫిరాయించారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ వస్తుందని ఆశించి భంగపడ్డ గీత తనకు టికెట్ రాదనీ తెలియటంతో ఆమె జనజాగృతి పార్టీని స్థాపించి పోటీ చేసి ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఇప్పుడు బీజేపీలో చేరారు .

 టీడీపీ టార్గెట్ గా బీజేపీ వ్యూహం .. చేరికలు స్టార్ట్ అయినట్టేనా ?

టీడీపీ టార్గెట్ గా బీజేపీ వ్యూహం .. చేరికలు స్టార్ట్ అయినట్టేనా ?

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్య నాయకులను ప్రభావితం చెయ్యటానికి చాలా ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి చాలా మంది మాజీ ఎంపీలు , ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్ లో ఉన్నారని ,అలాగే టీడీపీ నుండి కూడా చేరికలు ఉంటాయని చెప్తున్నారు. ఇక ఆ ప్రయత్నంలో తొలి అడుగు కొత్తపల్లి గీత రూపంలో పడింది. ఆమె బీజేపీలో చేరింది. భవిష్యత్ లో ఇంకా చాలా మంది నేతలు బీజేపీలో చేరే అవకాశం వుంది. బీజేపీ టీడీపీ ప్లేస్ ను రీ ప్లేస్ చెయ్యాలనే ఆలోచనలో టీడీపీ టార్గెట్ గా ఏపీలో పావులు కదుపుతుంది.

English summary
Former MP of Araku Kotthapalli Geetha has joined BJP on Tuesday. Since the latest couple of weeks, BJP is luring leaders from both the Telugu states but they did not turn fruitful and finally they made their first step in the form of Geetha. Back in August 2018, Geetha floated her political party by name Jana Jagruthi. But not many contested from the party in the recent elections. Eventually, Geetha lost all her glory and in a bid to revive her political career, Geetha met in-charge of Telugu states Ram Madhav. After discussing with him, Geetha along with Ram Madhav met BJP National President and Home minister Amit Shah in New Delhi. She also announced that she is merging her Jana Jagruthi party with BJP.The saffron party is desperately trying to influence Telugu leaders. AP BJP vice president Vishnuvardhan Reddy is constantly saying many former ministers and MLAs are in talks with them and in future most of them will join BJP. Overall, BJP is strategically making moves to become the main opposition replacing TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X