ఏపిలో 27 నుండి ఇంటర్..మార్చి 18 నుండి పదో తరగతి పరీక్షలు : 15న డీఎస్సీ మెరిట్ జాబితా..
Recommended Video
ఏపిలో పరీక్షల కాలం మొదలైంది. ఒక వైపు ఎన్నికల సమయం.. మరో వైపు పరీక్షల టెన్షన్. వచ్చే పరీక్షల షెడ్యూల్ ను ఏపి ప్రభుత్వం ప్రకటించింది. డీఎస్సీ -2018 మెరిట్ లిస్టును ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు మంత్రి గంటా ప్రక టించారు. అదే విధంగా పదో తరగతి..ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను సైతం విడుదల చేసారు.
ఈ
నెల
27
నుండి
ఇంటర్
పరీక్షలు
ఏపిలో
ఈ
నెల
27
నుండి
ఇంటర్
పరీక్షలు
జరుగుతాయని
మంత్రి
ప్రకటించారు.
ఇంటర్
పరీక్షలు
ఈ
నెల
27
నుంచి
మార్చి
18
వరకు
జరుగుతాయి.
1,430
పరీక్షా
కేంద్రాల
ద్వారా
ఇంటర్
ప్రథమ(5,07,302),
ద్వితీయ(5,10,298)
సంవత్స
రాలకు
చెందిన
10,17,600
మంది
విద్యార్థులు
పరీక్షలు
రాయబోతున్నట్లు
ప్రభుత్వం
వెల్లడించింది.
ఇక, ఇంటర్ ఫలి తాలను ఏప్రిల్ 4న విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక, పదో తరగతి పరీక్షలను మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. 6,21,623 మంది రెగ్యులర్, 1,070 మంది ఓరియంట్ ఎస్ఎస్సీ, ఒక్కసారి పరీక్ష తప్పిన ప్రైవేటు విద్యా ర్థులు 11,300 మంది 2,838 పరీక్షా కేంద్రాల్లో ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు.
15న
డీఎస్సీ
మెరిట్
లిస్టు..
డీఎస్సీ-2018
మెరిట్
జాబితా(లిస్టు)ను
ఈనెల
15న
విడుదల
చేయబోతున్నట్లు
రాష్ట్ర
మానవ
వనరుల
అభివృద్ధి
శాఖ
మంత్రి
గంటా
శ్రీనివాసరావు
వెల్లడించారు.
2018
డీఎస్సీ
7,902
పోస్టుల
కోసం
5,05,547
మంది
(85.81శాతం)
పరీక్షలకు
హాజరయినట్లు
ప్రభుత్వం
చెబుతోంది.
ఈ
నెల
15న
మెరిట్
జాబితా
విడుదల
చేస్తామని
మంత్రి
ప్రకటించారు.
పరీక్ష ల కోసం అన్ని ఏర్పట్లు చేస్తున్నామని వివరించారు. పదో తరగతి పరీక్ష కోసం వంద సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా తో పాటుగా .. 150 ఫ్లయింగ్ స్క్వాడ్ల నియామకం చేస్తున్నట్లు వివరించారు. అన్ని కేంద్రాలకు సరిపడా ఫర్నీచర్ సిద్ధం చేసామని..ఏప్రిల్ 27న ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించారు.