వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోము .. ప్రత్యర్ధి పార్టీలకు వార్నింగ్ ఇచ్చిన పురంధరేశ్వరి

|
Google Oneindia TeluguNews

బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఏపీ సీఎం వైయస్ జగన్ గురించి, అలాగే మాజీ సీఎం చంద్రబాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రత్యర్ధులపై ఆమె నిప్పులు చెరిగారు. బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోమని తేల్చి చెప్పారు. నిధుల కేటాయింపు వివరాలు చెప్పకుండా కేంద్రం నిధులివ్వడం లేదంటూ నిరాధార ఆరోపణలతో చాలా మంది నాయకులు మీడియాలో మాట్లాడుతున్నారని పేర్కొన్న పురంధరేశ్వరి తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

త్వరలో బీజేపీ భారీ బహిరంగ సభ ..ఒకే వేదికపై అమిత్‌షా, పవన్ కళ్యాణ్ .. కారణమిదేత్వరలో బీజేపీ భారీ బహిరంగ సభ ..ఒకే వేదికపై అమిత్‌షా, పవన్ కళ్యాణ్ .. కారణమిదే

రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యలేని అసమర్ధ ప్రభుత్వం

రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యలేని అసమర్ధ ప్రభుత్వం

నెల్లూరులో మంగళవారం పర్యటించిన పురంధరేశ్వరి కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇవ్వాల్సిన నిధులు ఇస్తుందని ,గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో అనేక పథకాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్న పురంధరేశ్వరి ప్రభుత్వ అసమర్ధతను పక్కన పెట్టి కేంద్రంపై నిందలు వేస్తుందని మండిపడ్డారు . సీఎం జగన్ ఏపీలో అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని పేర్కొన్నారు పురంధరేశ్వరి.

సీఎం జగన్ నిర్ణయాల వల్లే ఏపీకి ఈ దుస్థితి

సీఎం జగన్ నిర్ణయాల వల్లే ఏపీకి ఈ దుస్థితి

ఏపీలో టీడీపీ, వైసీపీలు స్వలాభం కోసమే పని చేస్తున్నాయని, రెండు పార్టీల విధానాలను ప్రజలు ఇష్టపడటం లేదని ఆమె పేర్కొన్నారు. ఇక ఏపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాల వల్లనే పోలవరం పనులు సక్రమంగా సాగడం లేదని ఆమె ఆరోపించారు. ఇక జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఏపీకి నష్టం కలిగిందని చెప్తున్నారు పురందేశ్వరి.

Recommended Video

AP CM YS Jagan On Disha Call Center And Disha Application At Rajahmundry | Oneindia Telugu
టీడీపీ, వైసీపీలపై నిప్పులు చెరిగిన చిన్నమ్మ

టీడీపీ, వైసీపీలపై నిప్పులు చెరిగిన చిన్నమ్మ

ఏపీలో టీడీపీ ,వైసీపీలు బీజేపీని దోషిని చెయ్యాలని చూస్తున్నాయని కానీ ఏపీ ప్రస్తుత పరిస్థితికి ఆ రెండు పార్టీలే కారణం అని పేర్కొన్నారు. సీఎం జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల నిర్మాణ రంగం కుదేలైందని, కూలీల జీవితాలు వీధినపడ్డాయని పురంధరేశ్వరి ఆరోపణలు గుప్పించారు . శాసనమండలి రద్దు చేయకూడదంటూ ఇపుడు నానా యాగీ చేస్తున్న చంద్రబాబు గతంలో రద్దు చేయాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు . భవిష్యత్ లో జనసేనతోనే కలిసి పనిచేస్తామని, టీడీపీ , వైసీపీ లపై నిప్పులు చెరిగారు పురంధరేశ్వరి .

English summary
BJP Women Morcha president Daggubati Purandareshwari made sensational comments about AP CM YS Jagan, as well as former CM Chandrababu. She has set fire to political opponents. She gave Strong Warning said that If the rival parties campaigning falsely against BJP will never tolerate, Purandareshwari had said that the Center was not funding the allocation of budget and that many leaders were speaking in the media with baseless allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X