వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం : లాక్ డౌన్ వేళ బయట తిరగవద్దన్నందుకు.. కన్నతండ్రినే కడతేర్చిన కొడుకు..

|
Google Oneindia TeluguNews

లాక్ డౌన్ వేళ అనవసరంగా బైక్‌పై బయట తిరగవద్దన్నందుకు ఓ కొడుకు కన్నతండ్రినే హతమార్చాడు. ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు మండలం తంగిరాలపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. తంగిరాలపల్లికి చెందిన లింగాల సుబ్బయ్య(58)కి మరియదాసు అనే కుమారుడు ఉన్నాడు. లాక్ డౌన్ నిబంధనలను కూడా పట్టించుకోకుండా మరియదాసు బైక్‌పై జులాయిగా తిరుగుతున్నాడు. దీంతో సుబ్బయ్య తరుచూ మందలించేవాడు. అలా ఇద్దరి మధ్య గొడవలు కామన్‌గా మారిపోయాయి.

father killed by son for reprimanding him in prakasam district

Recommended Video

ప్రకాశం జిల్లాకు AP రాజధాని || GVL Narasimha Rao Sensational Comments On AP Capital || Oneindia

ఇదే క్రమంలో శనివారం బయట నుంచి వచ్చిన మరియదాసును సుబ్బయ్య మందలించాడు. తీవ్ర కోపోద్రిక్తుడైన మరియదాసు తండ్రితో వాగ్వాదానికి దిగాడు. తండ్రిపై కక్ష పెంచుకున్నాడు. అదే రోజు రాత్రి సుబ్బయ్య మంచంపై నిద్రిస్తున్న సమయంలో.. రోకలి బండతో తలపై బలంగా దాడి చేసి హత్య చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు సుబ్బయ్యను మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుబ్బయ్య మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

English summary
In a gruesome turn of events, a 21-year-old Indian man killed his father as the latter repeatedly urged him to stop playing the popular battle royale game,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X