ఓ కామాంధుడి కథ: మూడు నెలలుగా కన్న కూతురిపై తండ్రి అత్యాచారం
అమరావతి: ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న కుమార్తె పాలిట కన్న తండ్రే కామాంధుడిగా మారాడు. బలవంతంగా లొంగదీసుకుని, పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఆ బాలిక తల్లికి విషయాన్ని చెప్పింది.
దీంతో తల్లీకూతుళ్లు పోలీసులను ఆశ్రయించిన సంఘటన చీరాల పట్టణంలోని పేరాలలో జరిగింది. వివరాల్లోకి వెళితే... పేరాలకు చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో కొంతకాలంగా విడివిడిగా నివసిస్తున్నారు.
పెద్ద కుమార్తె హాస్టల్లో ఉండి చదువుకుంటుండగా, రెండో కుమార్తె (13) తండ్రి వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో కుమార్తెపై కన్నేసిన ఆ తండ్రి బాలికను బలవంతంగా లొంగదీసుకున్నాడు. బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపుతానని బెదిరించాడు.
దీంతో ఆ బాలిక మౌనంగానే మూడు నెలల పాటు కన్నతండ్రి లైంగిక క్రీడను అనుభవించింది. అయితే ఇటీవల తరచూ కడుపునొప్పి వస్తుండటంతో ఆ బాలిక తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తల్లికి వివరించింది. దీంతో కుమార్తె వద్దకు వచ్చిన తల్లి ఆమెను తీసుకుని చీరాల డీఎస్పీ ప్రేమ్కాజల్ను ఆశ్రయించింది.
జరిగిన పరిస్థితిని డీఎస్పీకి పూసగుచ్చినట్లు చెప్పింది. దీంతో డీఎస్పీ సూచన మేరకు ఆదివారం టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను వైద్యపరీక్షల నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి పంపారు. పరారీలో ఉన్న బాలిక తండ్రి కోసం గాలిస్తున్నారు.