వీడు తండ్రేనా: కన్నకూతురిపై ఏడాదిగా తండ్రి అత్యాచారం
విజయవాడ: సభ్య సమాజానికి తలవంపులు తెస్తూ ఓ వ్యక్తి కన్న కూతురిపైనే అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. ఏడాది కాలంగా కూతురిపై అత్యాచారం చేస్తున్న భర్తపై అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని కొత్తపేటకు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురికి వివాహం జరిగింది. మిగతా ఇద్దరు కూతుళ్లు తల్లిదండ్రులతో కలిసి కూలీపనులకు వెళ్తున్నారు.
కూతురిపై లైంగిక వేధింపులు
ఏడాది క్రితం రెండవ కూతురు (17) ప్రేమ వివాహం చేసుకునేందుకు ప్రయత్నించింది. ఆమె మైనర్ కావడంతో అప్పట్లో పోలీసులు కౌన్సిలింగ్ చేసి ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. అప్పటి నుంచి తండ్రి ఆమెపై పడింది. లైంగికంగా ఆమెను వేధిస్తూ వస్తున్నాడు.
తండ్రి ఇలా చేశాడు
ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం మూడవ కూతురితో కలిసి భార్య ఓ గదిలో నిద్రిస్తుండగా రెండవ కూతురు మరో గదిలో నిద్రిస్తోంది. ఆ సమయంలో ఇంటికి వచ్చిన తం్రి రెండవ కూతురు నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విష,యం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు
చివరకు ధైర్యం తెచ్చుకుని...
చివరకు ధైర్యం చేసుకుని రెండవ కూతురు విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో తల్లీకూతుళ్లు శుక్రవారం రాత్రి వన్ టౌన్ పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కీచక తండ్రిపై కేసు
కీచక తండ్రిపై పోలీసులు ఐపిసి 508, 342, 376 సెక్షన్ల కింద, ఫోక్సా చట్టం కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్ల నిమిత్తం గుడివాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.