వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్న కొడుకే తండ్రిని రైల్లోంచి తోసేసి చంపాడు: ఎందుకు?

పశ్చిమగోదావరి జిల్లాలో మిస్సింగ్ కేసును గోపాలపురం పోలీసులు ఛేదించారు. 4 నెలల క్రితం సత్యనారాయణ అనే వ్యక్తి అదృశ్యమైయాడని పీఎస్ లో కేసు నమోదైంది.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో మిస్సింగ్ కేసును గోపాలపురం పోలీసులు ఛేదించారు. 4 నెలల క్రితం సత్యనారాయణ అనే వ్యక్తి అదృశ్యమైయాడని పీఎస్ లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నాలుగు నెలలైన సత్యనారాయణ ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు మరింత విచారణ చేపట్టారు. ఎంతకీ సత్యనారాయణ ఆచూకీ లభించలేదు. అనుమానం తో పోలీసులు సత్యనారాయణ భార్యను విచారించారు. అనంతరం సత్యనారాయణ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విచారణ లో సత్యనారాయణ తల్లి సూచనల మేరకు కొడుకు ప్రవర్తన పై అనుమానం వచ్చిన పోలీసులు కేసు ను మరో కోణం లో దర్యాప్తు ప్రారంభించారు.

 Father thrashed out from the running train in MP

దీనితో సత్యనారాయణ కొడుకుపై అనుమానం వచ్చిన పోలీసులు నిఘా వేసి సత్యనారాయణ మిస్సింగ్ పై కొన్ని అనుమానాలు ఉండటము తో తమదైన స్టైల్లో విచారణ ముగించారు. ఈ విచారణలో తన భార్యను వేధిస్తున్నాడనే కోపంతో కొడుకే చంపినట్టు పోలీసులు నిర్ధారించారు.

తండ్రిని నమ్మించి గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న తండ్రికి మెరుగైన వైద్యం చేయిస్తానని మధ్యప్రదేశ్ తీసుకెళ్లి.. తండ్రిని కదులుతున్న రైలు నుంచి తోసేసినట్టు విచారణలో వెల్లడించారు.

English summary
Son has killed his father in West Godavari district of Andhra Pradesh, thrashing out from the train
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X