రూ. 100 కోసం గొడవ...యువకుడి దారుణహత్య:స్నేహితులే హంతకులు
పశ్చిమగోదావరి: నూరు రూపాయల కారణంగా తలెత్తిన గొడవ ఓ యువకుడికి నూరేళ్లు నిండేలా చేసేంది. కేవలం 100 రూపాయల కోసం జరిగిన గొడవ కారణంగానే ఆ యువకుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసి పోలీసులు కూడా ఖిన్నులయ్యారు. వివరాల్లోకి వెళితే...
ఏలూరులో శ్రీహర్ష అనే యువకుడు రెండు రోజుల క్రితం హత్యకు గురయ్యాడు. దీనిపై కేసు నమోదుచేసి విచారణ ప్రారంభించిన పోలీసులకు హంతకులెవరనేది తొలుత అర్థం కాలేదు. ఆ తరువాత స్నేహితుల మధ్య గొడవ జరిగిందన్న విషయం తెలిసి ఆరా తీస్తే అసలు విషయం బైటపడింది. శ్రీహర్ష ను అతడి స్నేహితులే హతమార్చిన విషయం తెలిసి విస్మయం చెందిన పోలీసులు ఆ తరువాత హత్యకు కారణం తెలిసి దిగ్బ్రాంతి చెందారు.
రూ. 100 విషయంలో శ్రీహర్షకు అతని స్నేహితుల మధ్య ఘర్షణ జరిగిందని, దీంతో శ్రీహర్షను అతడి స్నేహితులే హతమార్చారని పోలీసుల విచారణలో తేలింది. ఈ హత్యకు పాల్పడ్డ శ్రీ హర్ష స్నేహితులను ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.