అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓట్ ఆన్ ఎకౌంట్ కోసం ఒత్తిడి చేయండి: ఇవియం ల పై పోరాటం : ఎంపీల‌కు బాబు నిర్ధేశం..!

|
Google Oneindia TeluguNews

పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఓటాన్‌ అకౌంట్‌ పెట్టకుండా ఫుల్‌ బడ్జెట్‌ పెట్టేలా చూస్తున్నారని..ఓటాన్‌ అకౌంట్‌ కోసం ఒత్తిడి చేయాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. దాడుల ద్వారా ప్రత్యర్థులను భయపెట్టాలని చూస్తున్నారని, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎంలపై సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈవీఎంల విషయంలో కేంద్రం స్పందించడం లేదని విమర్శించారు.

కేంద్రం పై ఒత్తిడి పెంచండి..

కేంద్రం పై ఒత్తిడి పెంచండి..

సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీపీ సమావేశమైంది. ఈ భేటీలో పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూ హంపై చర్చించారు. ఈవీఎంల వినియోగాన్ని వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజల డిమాండ్లనే రాజకీయ పార్టీలు అడిగేదని, అనేక పార్టీల్లో ఈవీఎంలపై వ్యతిరేకత ఉందని చంద్రబాబు చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలే ఈవీఎంలు వాడటం లేదని, హ్యాకర్లకు ప్రజాస్వామ్యాన్ని బలి చేయరాదన్నారు. ఈవీఎంల్లో హ్యాకింగ్‌కు 100శాతం అవ కాశాలు ఉన్నాయని, నమ్మకం లేని విధానంపై ఒత్తిడి చేయరాదని వ్యాఖ్యానించారు. నవరత్న కంపెనీలను నిర్వీర్యం చేస్తున్నారని, నవరత్న కంపెనీలే దేశ సంపద అని సీఎం పేర్కొన్నారు. గుజరాత్ లాభం కోసం ఓఎన్‌జీసీని నష్టాల్లోకి నెట్టారని, ఎన్‌బీసీసీ ఇండియాను దెబ్బతీశారని దుయ్యబట్టారు. రాజకీయ నాయకత్వాన్ని చంపేయాలనే కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. దేశం మొత్తం భయోత్పాతం సృష్టిస్తున్నారని, అన్ని పార్టీలను సమన్వయం చేయాలని ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్ధేశం చేసారు.

ఏపి కి అన్యాయం గ‌ళం ఎత్తండి..

ఏపి కి అన్యాయం గ‌ళం ఎత్తండి..

నాలుగున్నరేళ్లలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగింద‌ని ముఖ్య‌మంత్రి ఆవేద‌న వ్య‌క్తం చేసారు. విభజన చట్టంలో హామీ లను అమలు చేయలేదంటూ స‌భ్యుల‌కు లెక్క‌ల‌ను వివ‌రించారు. కేంద్రం ఇచ్చిన హామీల్లో ఐదు అంశాలు పాక్షికంగా అమలయ్యాయ‌న్నారు. వెనుకబడిన జిల్లాలకు రూ.24,350 కోట్లు ఇవ్వాలని కోరగా..అందులో... నాలుగున్నరేళ్లలో రూ. 1,050 కోట్లు ఇచ్చారన్నారు. రూ.350 కోట్లు వెనక్కి తీసుకుని ఏడాది అవుతోందిని.. వెంటనే రూ.700 కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ చెప్పిందని వివ‌రించారు.

తెలంగాణలో 9 జిల్లాలకు

తెలంగాణలో 9 జిల్లాలకు

7 జిల్లాలకు రెండేళ్ల నిధులు రూ.700 కోట్లు నిలిపేశారని... తెలంగాణలో 9 జిల్లాలకు రూ.450 కోట్లు ఇచ్చారుని.. 7 జిల్లాల్లో రూ.1,641 కోట్లతో 25,007 పనులు చేపట్టామ‌ని ముఖ్య‌మంత్రి ఎంపీల‌కు వివ‌రిం చారు. అన్ని పార్టీల‌తో క‌లిసి ఉమ్మ‌డి అజెండా రూపొందించుకోవాల‌న్నారు. దేశ వ్యాప్తంగా మోదీ వ్య‌తిరేక స‌భ‌లు నిర్వ హించాల‌ని నిర్ణ‌యించిన స‌మావేశం..అమ‌రావ‌తిలో స‌భ తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించాల‌ని డిసైడ్ అయ్యారు.

English summary
TDP Chief Chandra Babu directed party M.P's to fight for vote on account in place of full budget in coming sections. continue anti EVM's moment along with alliance parties. Demand central Govt implement Ap Re organisation Act for Ap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X