వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గోదారి పుష్కరాల్లో మరో అపశ్రుతి: భారీ అగ్నిప్రమాదం, అంధకారంలో రాజమండ్రి
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి పుష్కరాల్లో మరో అపశ్రుతి చోటు చేసుకుంది. రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. పుష్కరఘాట్ సమీపాన ఉన్న ఒక కిళ్ళీ షాపులో తొలుత ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
వెంటనే మంటలు మరో దుకాణానికి వ్యాపించాయి. సమీపంలోని ట్రాన్స్ఫారం పేలిపోయింది. పుష్కర యాత్రికులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. రాజమండ్రిలోని గోకవరం బస్ స్టాండ్ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది.
బస్టాండ్ సమీపంలోని జగదాంబ రెస్టారెంట్ వంటశాలలో గ్యాస్ లీక్ కావడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. మూడు పోలీసు వాహనాలు, కారు, ఓ ఆటో, పది ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి.
Comments
godavari pushkaralu rajamundry fire accident chandrababu naidu గోదావరి పుష్కరాలు రాజమండ్రి అగ్ని ప్రమాదం చంద్రబాబు నాయుడు
English summary
Fire accident occured at Gokavaram bus stand in Rajamundry during Godavari pushkaralu in Andhra Pradesh.