శ్రీకాకుళం జిల్లా ఆప్కో వస్త్రాలయంలో అగ్నిప్రమాదం..భారీ నష్టం
శ్రీకాకుళం జిల్లా: కాశీబుగ్గలోని ఆప్కో చేనేత వస్త్రాలయంలో శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభంవించి మంటలు ఎగసిపడటంతో వస్త్రాలయం అంతా అగ్నికి అహుతైంది.
అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్నఅగ్నిమాపక దళం సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంతో ఆప్కోకు భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
జీఎస్టీ వచ్చిన తర్వాత నుంచి ఉత్పత్తుల శాతం తగ్గుతూ వస్తోంది. దీనికితోడు కార్మికులకు వేతనాలు తగ్గిపోవడంతో.. వేరే పనుల్లోకి వెళ్లిపోతున్నారు. మరికొందరు ఈ రంగాన్ని వదులుకోలేక సతమతమవుతున్నారు. ఇంకొందరు కళంకారీ వైపు మళ్లుతున్నారు.
ఇటీవలి కాలంలో చేనేతల నుంచి సేకరించిన వస్త్రాలు ఇంకా స్టాక్ డెలివరీ చెయ్యకపోవడం వల్ల పెద్ద ఎత్తున సరుకు ఇక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. వారికి ఇంకా బకాయిలు చెల్లించక ముందే ఇలా అగ్నిప్రమాదం కారణంగా స్టాక్ తగలబడిపోవడంతో ఆప్కో కు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది.