వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోదావరి నదిలోకి దూసుకెళ్లిన కారు: ఐదుగురు దుర్మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

కాకినాడ: యానం శివారులోని దరియాలతిప్ప వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండికా కారు గోదావరి నదిలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.

Five dead as car plunged into Godavari river

ప్రమాదానికి గురైన కారు నంబరు ఏపీ 05వీ0201గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని తూరంగి డ్రైవర్ కాలనీకి చెందిన పొప్పాడి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులుగా గుర్తించారు.

Five dead as car plunged into Godavari river

కారు అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొని నదిలో పడిపోయింది. అయితే చీకటిగా ఉండడంతో ఆ ప్రమాదాన్ని వెంటనే ఎవరూ గుర్తించలేదు. శనివారం తెల్లవారు జామున కారు నీటిలో తేలుతుండడాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Five dead as car plunged into Godavari river

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించరు.

English summary
Five passengers died as a car plunged into Godavari river near Yanam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X