కడపలో రోడ్డు ప్రమాదం ఐదుగురు మృతి
Recommended Video
కడప:కడప జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటన లో ఐదుగురు మరణించారు. కారు డ్రైవర్ సహ మరో నలుగురు ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.కొత్త సంవత్సరం రోజు విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
కడప జిల్లాలోని పెండ్లిమర్రి మండలం ఇందిరానగర్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చలిమంట కాచుకుంటున్న వారిపై నుంచి కారు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.
వేంపల్లి నుంచి కడపవైపు కారు వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కన చలిమంట కాచుకుంటున్న వారిపై నుంచి వెళ్లిందని ప్రత్యక్ష సాక్షలు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇందిరానగర్కు చెందిన లక్ష్మీనరసింహ (14), కార్తీక్ (14), గిరి (15), భాస్కర్ (26) గా గుర్తించారు.
ప్రమాదంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.