వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారి కోసం .. నిన్న అసోం సీఎంతో .. ఇప్పుడు గుజరాత్ సీఎంతో మాట్లాడిన ఏపీ సీఎం జగన్

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని మత్స్యకారుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు. నిన్నటికి నిన్న అసోం ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్‌‌కు ఫోన్ చేసిన సీఎం జగన్ తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి ఫోన్ చేశారు . గుజరాత్ లో చిక్కుకున్న మత్స్యకారులను ఆదుకోవాలని కోరారు. నిన్నటికి నిన్న లాక్ డౌన్ కారణంగా నష్టపోతున్న మత్స్యకారులను ఆదుకునేందుకు మత్స్యకారుల లబ్ధిదారుల కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించిన సీఎం జగన్ తాజాగా చేపల ఎగుమతికి అనుమతిని ఇవ్వాలని , అడ్డంకులను తొలగించటానికి దృష్టి పెట్టాలని అసోం సీఎంతో మాట్లాడారు .

వద్దన్నా ఫుడ్ డెలివరీలు ... స్విగ్గి , జొమాటో డెలివరీ బాయ్స్ వాహనాలు సీజ్వద్దన్నా ఫుడ్ డెలివరీలు ... స్విగ్గి , జొమాటో డెలివరీ బాయ్స్ వాహనాలు సీజ్

ఇక ఇదే క్రమంలో గుజరాత్ సీఎంతో కూడా జగన్ మత్స్యకారుల గురించి మాట్లాడారు . పొట్టకూటి కోసం గుజరాత్ సముద్ర తీరానికి వెళ్లి, లాక్ డౌన్ కారణంగా అక్కడ ఏపీ మత్స్యకారులు చిక్కుకున్నారని, ఆహారం , నీళ్ళు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు గుజరాత్ సీఎం విజయ్ రూపానీకి ఫోన్ చేసిన జగన్ ఆయనతో కరోనా పరిస్థితుల గురించి మాట్లాడారు . అక్కడి తెలుగు మత్స్యకారుల అంశం కూడా మాట్లాడిన ఆయన వారికి అండగా ఉండాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోరారు .

For the fishermen, AP CM Jagan spoke with Gujarat CM

Recommended Video

Coronavirus : Telangana Government Decided To Take Corona Samples @ Home

ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికార ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఇక సీఎం జగన్ గుజరాత్‌లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆదుకోవాలని గుజరాత్‌ సీఎం విజయ్‌రూపానీకి ఏపీ సీఎం వైయస్ జగన్ ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారని , వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని చేసిన విన్నపం మేరకు సానుకూలంగా స్పందించిన సీఎం విజయ్ రూపానీ, అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారని ట్వీట్ చేశారు .మొత్తానికి సీఎం జగన్ మత్స్య కారుల కోసం తీసుకుంటున్న చొరవతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

English summary
CM Jagan, who spoke to the Assam CM, also spoke with the Gujarat CM about the fishermen. He said that fishermen went to the Gujarat coast for fishing and they stuck up there . they are struggling for food .Jagan telephoned Gujarat CM Vijay Rupani and spoke to him about the corona situation. He also spoke about the fishermen and asked the Gujarat government to support them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X