ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాజీ కేంద్రమంత్రి, ఆంధ్రా షుగర్స్ ఎండీ బోళ్ల బుల్లి రామయ్య కన్నుమూత

|
Google Oneindia TeluguNews

పశ్చిమగోదావరి: కేంద్ర మాజీమంత్రి, తణుకు ఆంధ్రా షుగర్స్‌ ఎండీ బోళ్ల బుల్లిరామయ్య(91) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బుధవారం ఉదయం మృతి చెందారు.

1926 జులై 9న తూర్పుగోదావరి జిల్లా తాటిపాకలో జన్మించిన బుల్లిరామయ్య.. 1984, 1991, 1996, 1999లో ఏలూరు నుంచి ఎంపీగా పనిచేశారు. 1996-98 మధ్య కేంద్ర వాణిజ్య శాఖ సహాయమంత్రిగా కూడా ఆయన పనిచేశారు.

Former Central Minister Bolla Bulli Ramaiah Passes Away

బుల్లిరామయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంతాపం తెలిపారు. తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు బుల్లిరామయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.

బుల్లిరామయ్య కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీ రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, పైడికొండల మాణిక్యాలరావు, కెఎస్‌ జవహర్‌ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం పెదపట్నం అగ్రహారంలో బోళ్ల బుల్లిరామయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.

English summary
Former Central Minister Bolla Bulli Ramaiah Passed Away on Wednesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X