మాజీ సిఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కన్నుమూత
నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గత మూడేళ్లుగా పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారు. జనార్ధన్రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా వాకాడు. 1935 ఫిభ్రవరి 20న నెల్లూరు జిల్లా వాకాడులో ఆయన జన్మించారు. 1990-92 వరకు నేదురమల్లి జనార్ధన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
1972లో రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన మూడుసార్లు లోకసభ సభ్యుడిగా గెలిచారు. 1988-89లో రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. 1998లో బాపట్ల, 1999లో నర్సారావుపేట లోకసభ స్థానాల నుంచి గెలిచారు. ఆ తర్వాత 2004లో విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి విజయం సాధించారు. 2009లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 2010లో మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1978 - 83మధ్య ఆయన రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా పనిచేశారు.
నేదురుమల్లి జనార్దన్ రెడ్డిపై 2007లో నక్సలైట్ల దాడి జరిగింది. ఈ దాడి నుంచి ఆయన తప్పించుకున్నారు. ఆయన సతీమణి నేదరుమల్లి రాజ్యలక్ష్మి వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. ఆయనకు రామ్కుమార్ రెడ్డి, అశోక్ కుమార్ రెడ్డి, గౌతమ్ రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి అనే కుమారులున్నారు.