అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మాజీ మంత్రి కన్నా, వైసీపీలో చేరిక వాయిదా?
గుంటూరు:మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బుధవారం నాడు అస్వస్థతకు గురయ్యారు. బీపీ, షుగర్తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నా లక్ష్మీనారాయణ చేరారు. ప్రస్తుతం జిజెపిలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ వైసీపీలో చేరేందుకు ముహుర్తాన్ని పెట్టుకొన్నారు.
బిజెపిలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో బిజెపిని వీడి వైసీపీలో చేరాలని కన్నా లక్ష్మీనారాయణ ప్లాన్ చేసుకొంటున్నారని వార్తలు వెలువడుతున్నాయి.ఈ తరుణంలో కన్నా లక్ష్మీనారాయణ ఆసుపత్రిలో చేరారు.
కన్నా
లక్ష్మీనారాయణకు
రెండు
రోజుల
పాటు
విశ్రాంతి
అవసరమని
వైద్యులు
సూచించారు.ఈ
సూచన
మేరకు
కన్నా
లక్ష్మీనారాయణ
విశ్రాంతి
తీసుకొంటున్నారు.
2014
ఎన్నికల
సమయంలో
కన్నాలక్ష్మీనారాయణ
కాంగ్రెస్
పార్టీ
నుండి
బిజెపిలో
చేరారు.
అప్పటి నుండి ఆయన బిజెపిలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్బై చెప్పాలని భావిస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ బిజెపికి గుడ్ బై చెప్పినట్టుగా కూడ ప్రచారం సాగుతోంది. కానీ, ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది. వైసీపీలో చేరాలని ముహుర్తంగా పెట్టుకొన్న రోజే అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడం గమనార్హం.
అనారోగ్యంతో కన్నా లక్ష్మీనారాయణ ఆసుపత్రిలో చేరడంతో వైసీపీలో చేరిక వాయిదా పడినట్టుగా ఆయన అనుచరులు చెబుతున్నారు.