వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారి వల్లే ప్రత్యేక హోదా రాదు: చింతా మోహన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరుపతి: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఏపీకి ప్రత్యేకహోదా రాదని మాజీ ఎంపీ చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. బుదవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబుకు అసెంబ్లీ సీట్ల పెంపుపై ఉన్న శ్రద్ధ ప్రత్యేకహోదా సాధించడంపై లేదని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. గత ఏడాది బడ్జెట్ ను రూ.1.76 లక్షల కోట్లుగా చూపించారన్నారు. కానీ, రాష్ట్రంలో ఏం పనులు చేశారో మాత్రం చెప్పడం లేదని విమర్శించారు.

 Former Tirupati Mp Chinta Mohan slams on TDP

ఏపీలో టిడిపి, కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నంత కాలం ఏపీకి ప్రత్యేక హోదా రాదని చింతా మోహన్ స్పష్టం చేశారు. మరో వైపు సీపీఎం నేత మధు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం చంద్రబాబు కార్యాచరణ ఏంటో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.

ప్రత్యేక హోదాతోనే ఏపీకి న్యాయం జరుగుతోందని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు.ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ అంటూ ఊదరగొట్టిన టిడిపి, బిజెపిలు ఏపీకి ఏ మేరకు న్యాయం చేశారని చింతా మోహన్ ప్రశ్నించారు.

English summary
former Tirupati MP Chinta Mohan made allegations on Tdp and Bjp . He spoke to media on Wednesday at Tirupati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X