వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలకలం: గోదావరిలో మహిళతోపాటు నలుగురి మృతదేహాలు లభ్యం

|
Google Oneindia TeluguNews

పశ్చిమ గోదావరి: జిల్లా కొవ్వూరు వద్ద గోదావరి నదిలోని లాంచీలరేవులో గుర్తు తెలియని నాలుగు మృతదేహాలు బయటపడ్డాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శనివారం ఉదయం లాంచీలరేవు వద్దకు వెళ్లిన స్థానికులు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.

పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతుల వివరాలపై ఆరా తీస్తున్నారు. మృతుల్లో మహిళ, నాలుగేళ్ల బాలిక, ఇద్దరు పురుషులు ఉన్నారు. లాంచీలరేవులో మృతదేహాలను బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Four dead bodies found in Godavari river at Kovvur

మృతులు పరిసర గ్రామాలకు చెందినవారై ఉండొచ్చనే అనుమానంతో వివరాలు సేకరిస్తున్నారు. గోదావరిలో స్నానాలకు దిగి ప్రమాదవశాత్తు మృతి చెందారా? లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే విషయం తేలాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Four dead bodies found in Godavari river at Kovvur in West Godavari district on Saturday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X