వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కలకలం: గోదావరిలో మహిళతోపాటు నలుగురి మృతదేహాలు లభ్యం
పశ్చిమ గోదావరి: జిల్లా కొవ్వూరు వద్ద గోదావరి నదిలోని లాంచీలరేవులో గుర్తు తెలియని నాలుగు మృతదేహాలు బయటపడ్డాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శనివారం ఉదయం లాంచీలరేవు వద్దకు వెళ్లిన స్థానికులు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతుల వివరాలపై ఆరా తీస్తున్నారు. మృతుల్లో మహిళ, నాలుగేళ్ల బాలిక, ఇద్దరు పురుషులు ఉన్నారు. లాంచీలరేవులో మృతదేహాలను బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మృతులు పరిసర గ్రామాలకు చెందినవారై ఉండొచ్చనే అనుమానంతో వివరాలు సేకరిస్తున్నారు. గోదావరిలో స్నానాలకు దిగి ప్రమాదవశాత్తు మృతి చెందారా? లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే విషయం తేలాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
English summary
Four dead bodies found in Godavari river at Kovvur in West Godavari district on Saturday morning.
Story first published: Saturday, June 23, 2018, 14:46 [IST]