వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖలో రోడ్డు ప్రమాదం , నలుగురు మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం

విశాఖ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించగా, మిగిలినవారు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన విశాఖ జిల్లా గోకుపాడు జంక్షన్ వద్ద చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

విశాఖ పట్టణం :విశాఖ పట్టనం జిల్లా ఎస్ . రాయవరం మండలం గోకుపాడు సమీపంలో బుదవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించాడు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

హైద్రాబాద్ లోని హయత్ నగర్ లో నివసిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన పదకొండు మంది విశాఖలోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. విశాఖ నుండి స్కార్పియోలో అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేుకొంది. గోకుపాడు జంక్షన్ దాటిన తర్వాత కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది.

four members dead in road accident at gokupadu junction

దీంతో కారు అవతలి రోడ్డుపైకి దూసుకువెళ్ళింది. పక్క రోడ్డులో ఎదురుగా వస్తోన్న లారీని ఈ స్కార్పియో డీకొట్ింది. ఈ ప్రమాదంలో రూప, రాజేష్ అక్కడికక్కడే మరణించారు. సుభోసింగ్ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఈ కారులో మరొకరు కూడ చనిపోయారు.

ఇదే కారులో ఉన్న ఏడాది చిన్నారి శ్రామేలి, నేహసింగ్, గీతాసింగ్ తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నారు. ఈ ప్రమాదంలో 16ఏళ్ళ వయస్సులోపు వయస్సున్న యహోసింగ్ , రిషిసింగ్ అభిషేక్ , బింధు ప్రియ, అభిజిత్ లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ శ్రీనివాస్ కు కూడ తీవ్రంగా గాయపడ్డాడు.

English summary
four members dead in road accident in gokupadu junction in vishaka district. around 11 members went to annavaram from hayatnagar in telangana state. 4 members dead, injuries shifted to hospital.:
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X