టెక్కీలకు షాక్: 40 లక్షల ఐటీ ఉద్యోగాలకు ముప్పు
ఆటోమెషన్ దెబ్బ ఐటీ ఇండస్ట్రీకి భారీగానే దెబ్బతగిలే అవకాశం ఉంది.డిజిటల్ టెక్నాలజీలోకి మళ్ళే క్రమంలో ఇప్పటికే చాలా ఐటీ సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించుకొంటూ పోతున్నాయి.
న్యూఢిల్లీ: ఆటోమెషన్ దెబ్బ ఐటీ ఇండస్ట్రీకి భారీగానే దెబ్బతగిలే అవకాశం ఉంది.డిజిటల్ టెక్నాలజీలోకి మళ్ళే క్రమంలో ఇప్పటికే చాలా ఐటీ సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించుకొంటూ పోతున్నాయి.
టెక్కీలకు షాక్: కాగ్నిజెంట్లో 4 వేల మంది ఉద్యోగులపై వేటు
కొత్త నియామకాల జోరు కూడ తగ్గింది. ఆచితూచి అడుగులు వేస్తున్నాయి ఐటీ కంపెనీలు. ఈ విషయమై అెమెరికాకుయ చెందిన బిజినెస్ అడ్వయిజరీ సంస్థ హెచ్ఎప్ఎస్ రీసెర్చ్ అంచనాల ప్రకారం ఆటోమెషన్ ప్రభావంతో దేశీయ ఐటీ వర్క్ఫోర్స్ 14 శాతం తగ్గిపోనుందని సమాచారం.
2021 నాటికి నలభై లక్షల మంది ఉద్యోగులు ప్రమాదంలో పడిపోనున్నారు. బిపిఓ రంగంలోని సంప్రదాయబద్దమైన హ్యుమన్ రోల్స్ అన్ని ఐటీ ఉద్యోగాలకు సమానం కావు. ఆటోమెషన్ ప్రభావంతో ఇతర రంగాలతో పోలిస్తే సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఎక్కువ ప్రభావితం కానుందని రీసెర్చ్ రిపోర్టులు చెబుతున్నాయి.
షాక్: టెక్ మహీంద్రాలో టాప్ ఎగ్జిక్యూటివ్ల వేతనాల్లో కోత
అయితే కొన్ని రకాల ఐటీ ఉద్యోగాలు ఒక కన్పించే అవకాశాలు ఉండకపోవచ్చని ఈ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆన్లైన్ ఫ్రోఫెషనల్ ఎడ్యుకేషన్ ఫ్లాట్ఫామ్ సింప్లిలెర్న్ రీసెర్చ్ రిపోర్టు ప్రకారం వచ్చే ఐదేళ్ళలో కొన్ని ఉద్యోగాలు భారీగా పడిపోతున్నాయని ఈ నివేదిక వెల్లడిస్తోంది.
మాన్యువల్ టెస్టింగ్లో సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్, క్యూ ఏ ఇంజనీర్, మాన్యువల్ టెస్టర్ ఆటోమెషన్ కారణంగా ప్రభావితమయ్యే అవకాశం లేకపోలేదు.
సిస్టమ్ ఇంజనీర్, ఐటీ ఆపరేషన్స్, మేనేజర్ , సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ సపోర్ట్, సర్వర్ మెంటెనెన్స్, మైంటెనెన్స్ ఇంజనీర్ విభాగాలపై తీవ్ర ప్రభావం కన్పించే అవకాశాలున్నాయి.