వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం పాపం చేశారని?: కరణం వర్గీయుల అంత్యక్రియల్లో మిన్నంటిన రోదనలు..

మృతదేహాలను తొలుత గ్రామంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద కొంత సేపు ఉంచి, తరువాత వారి వారి గృహాలకు చేర్చారు. ఆపై అంత్యక్రియలు నిర్వహించారు.

|
Google Oneindia TeluguNews

ప్రకాశం: ఏపీలో వరుస ఫ్యాక్షన్ కక్షలు అక్కడి జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రకాశం జిల్లా వేమవరంలో ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గీయులపై ప్రత్యర్థుల దాడిని మరిచిపోకముందే.. కర్నూలు జిల్లాలో మరో ఫ్యాక్షన్ భూతం పడగవిప్పింది. అద్దంకి ఘటనలో మృతి చెందిన బలరాం అనుచరులకు ఆదివారం నాడు అంత్యక్రియలు నిర్వహించారు.

ప్రకాశం పగలు: గొట్టిపాటి వర్సెస్ కరణంప్రకాశం పగలు: గొట్టిపాటి వర్సెస్ కరణం

ప్రత్యర్థుల దాడిలో మృతి చెందిన పెద్ద అంజయ్య, ఎ.కోటేశ్వరరావుల మృతదేహాలు గ్రామానికి చేరుకోగానే ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం సంతరించుకుంది. మృతుల బంధువులు గుండెలు బాదుకుంటూ రోదించారు. "ఏ పాపం చేశారని.. ఇలా అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు" అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

fuenral held for who died in addanki faction attack

మృతదేహాలను తొలుత గ్రామంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద కొంత సేపు ఉంచి, తరువాత వారి వారి గృహాలకు చేర్చారు. ఆపై అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సందర్భంగా.. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి టీడీపీ నేతలంతా తరలివచ్చారు.

మృతదేహాలకు ఎమ్మెల్సీ కరణం బలరాం, నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జీ వెంకటేశ్ నివాళులు అర్పించారు.
తమ తండ్రులు మరణించారన్న విషయం తెలుసుకుని, మృతుల కుమారులు.. అమెరికా నుంచి వేమవరం చేరుకుని అంత్యక్రియలు నిర్వహించారు.

English summary
On sunday, funeral was held for two dead bodies, who died in faction attack at Addanki village. Mlc Karanam Balaram was attended
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X