వోల్వోలో మంటలు: కళాశాల విద్యార్థులకు అస్వస్థత
దీంతో ప్రయాణీకులు ఒక్కసారిగా భయంతో బస్సులో నుండి బయటకు పరుగు తీశారు. దగ్గర్లోనే ఫైరింజన్లు ఉన్నాయి. సమాచారం అందటంతో ఫైరింజన్లు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. బస్సులోని యాసిడ్ డబ్బానే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. యాసిడ్ లీకేజీతో మంటలు చెలరేగాయని చెబుతున్నారు.
దంపతుల ఆత్మహత్య
మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ ఆర్టీసి బస్టాండులో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు దంపతుల వివరాలు సేకరిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో లారీ, ఆటో ఢీకొని ఇద్దరు మృతి చెందారు.
పుడ్ పాయిజన్.. 200 మందికి అస్వస్థత
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బోడుప్పల్లోని ఓ కళాశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా రెండు వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఈ ఫుజ్ పాయిజన్ జరిగింది. కళాశాల యాజమాన్యం దీనిని గోప్యంగా ఉంచింది. తల్లిదండ్రులకు సమాచారం అందించలేదు. దీనిపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విద్యార్థులను పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.