కొత్త పార్టీకి గాదె: జెసి, వీరశివాల మధ్య ఆసక్తికర చర్చ
గాదెను సీమాంధ్రలో పెట్టబోయే కొత్త పార్టీకి నాయకుడిగా చేస్తామని, అభ్యంతరమా అని జెసిని వీరశివా రెడ్డి ప్రశ్నించారు. అందుకు జెసి స్పందిస్తూ.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఆయనను నాయకుడిగా చేసుకోవాలని చెప్పారు. దీనికి గాదె ఏమీ మాట్లాడకుంటానే నవ్వుతూ వెళ్లిపోయారట.
మరోవైపు, కాంగ్రెస్లో తెలంగాణ రాష్ట్ర సమితి విలీనంపై సందర్భం, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వేరుగా చెప్పారు. ఈ విషయంపై ఇప్పుడు చర్చ, ఆందోళన అవసరం లేదని పార్టీ ముఖ్య నేతలకు సూచించారట.
సోమవారం తెలంగాణ భవన్లో కెసిఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జీలు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై కెసిఆర్ మాట్లాడారు. విలీనం అంశం తానొక్కడిని తీసుకునే నిర్ణయం కాదని, అందరం కలిసి తీసుకునేదని చెప్పారట.