విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలవరం ప్రాజెక్ట్ పనులను కలసి పరిశీలించనున్న గడ్కరీ, చంద్రబాబు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

Recommended Video

జమిలికి షరతులతో వైసీపీ మద్దతు, రాజ్యసభ 'డిప్యూటీ' ఎన్నికల్లో బీజేపీకి షాక్!

విజయవాడ:జూలై 11 బుధవారం నాడు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పనులను కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారని మంత్రి దేవినేని ఉమ తెలిపారు.

ఒక టివి ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి దేవినేని ఉమా ఈ విషయం వెల్లడించారు. సవరించిన పోలవరం అంచనాలను కేంద్రానికి పంపామని తెలిపారు. రూ.57 వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్ అంచనాలు సవరించినట్లు వెల్లడించారు. 2013 చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాసం అంచనాలు పెరిగాయని...అవి 3 వేల కోట్ల నుంచి 33 వేల కోట్లకు పెరిగినట్లు మంత్రి ఉమా తెలియజేశారు.

 Gadkari and Chandra Babu to visit Polavaram on Wednesday

పోలవరం ప్రాజెక్ట్ కోసం తక్షణమే 10 వేల కోట్లను విడుదల చేయాలని తాము గడ్కరీని కోరుతామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తయిన పనుల నిమిత్తం కేంద్రం నుంచి రూ.2300 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని మంత్రి తెలిపారు. వాటికి సంబంధించి పోలవరం అథారిటీకి బిల్లులు సమర్పించామన్నారు. డయా ఫ్రం వాల్ పూర్తి చేశామని, గోదావరి వరదతో పనులు ఆగలేదని మంత్రి ఉమా వెల్లడించారు.

English summary
Vijayawada:Minister for road transport and highways, shipping and water resources, river development, Nitin Gadkari and AP CM Chandra Babu will visit polavaram project on wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X