ఏపీలో జగన్ విజయంపై గాలి జనార్ధన్ రెడ్డి ఏమన్నారంటే
కర్ణాటక బీజేపీ నేత, మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక దేశంలోనూ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మరోమారు ఘన విజయాన్ని అందుకుని రెండోసారి అధికారంలోకి రావడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు. దీంతో ఆయన సోమవారం కర్నూలు జిల్లాలోని మంత్రాలయం చేరుకుని రాఘవేంద్రస్వామికి మొక్కులు సమర్పించుకున్నారు.స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గాలి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ సీఎంగా జగన్ తన పాలనలో తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. అద్భుత పాలనతో చరిత్రలో గొప్ప సీఎంగా నిలిచిపోవాలని ఆకాంక్షిస్తున్నట్టు గాలి జనార్ధన్ రెడ్డి చెప్పారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడంతో రాఘవేంద్రస్వామికి మొక్కులు సమర్పించుకున్నట్టు తెలిపారు గాలి జనార్ధన్ రెడ్డి .