టి, సీమాంధ్ర కాంగ్రెస్కు వేర్వేరు భవనాలు (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెసు, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీకి వేర్వేరు అధికార భవనాలు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు నాంపల్లిలో ఉన్న గాంధీ భవన్ తెలంగాణ కాంగ్రెసు పార్టీకి దక్కింది.
సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీకి ఇందిరా భవన్ వచ్చింది. విభజన నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణకు, సీమాంధ్ర ప్రాంతానికి వేర్వేరు పిసిసిలు, ఎన్నికల ప్రచార కమిటీలు వేసిన విషయం తెలిసిందే.
దీంతో ఇప్పుడు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు గాంధీ భవన్లో, సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలు ఇందిరా భవన్లో వరుసగా భేటీ అవుతూ... ఎన్నికల కోసం వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు.
గాంధీ భవన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెసు, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీకి వేర్వేరు అధికార భవనాలు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు నాంపల్లిలో ఉన్న గాంధీ భవన్ తెలంగాణ కాంగ్రెసు పార్టీకి దక్కింది.
గాంధీ భవన్
సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీకి ఇందిరా భవన్ వచ్చింది. విభజన నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణకు, సీమాంధ్ర ప్రాంతానికి వేర్వేరు పిసిసిలు, ఎన్నికల ప్రచార కమిటీలు వేసిన విషయం తెలిసిందే.
గాంధీ భవన్
దీంతో ఇప్పుడు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు గాంధీ భవన్లో, సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలు ఇందిరా భవన్లో వరుసగా భేటీ అవుతూ... ఎన్నికల కోసం వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు.
ఇందిరా భవన్
సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు తమ అభ్యర్థుల వడపోత కోసం మంగళవారం ఇందిరా భవన్లో భేటీ అయ్యారు. ఇందిరా భవన్లో రఘువీరారెడ్డి అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశానికి కేంద్ర మంత్రులు చిరంజీవి, పళ్ళంరాజు, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, ఎంపీలు కెవిపి రామచంద్ర రావు, జెడి శీలం, పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పలువురు రాష్ట్ర మాజీ మంత్రులు పాల్గొన్నారు.
ఇందిరా భవన్
ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రలో కాంగ్రెస్ బలహీనపడిందని, పోటీకి అభ్యర్థులే కరవయ్యారన్న విపక్షాల ప్రచారంలో పసలేదన్నారు. పార్టీ బలహీనపడితే సీమాంధ్రలోని 25 లోక్సభ స్థానాలకు 176 దరఖాస్తులు, 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు 1160 దరఖాస్తులు ఎలా వచ్చేవని ప్రశ్నించారు. తనతో పాటు చిరంజీవి, బొత్సను తీసుకురావాల్సిందిగా అధిష్ఠానం సూచించిందని తెలిపారు. సీమాంధ్రలో పార్టీని బతికించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.