వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం: బాలికపై ఏడుగురు గ్యాంగ్ రేప్..

|
Google Oneindia TeluguNews

దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో దారుణం జరిగింది. ఓ గిరిజన బాలికపై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధితురాలిని ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం నల్లకుంట గ్రామానికి చెందిన గిరిజన బాలికగా గుర్తించారు. దమ్మపేట మండలంలోని రాచూరుపల్లిలో ఆమె స్నేహితురాలు ఉండటంతో.. ఈ నెల 20న ఆమె ఇక్కడికి వచ్చింది.

gang rape on tribal girl in bhadradri kothagudem

స్నేహితురాలితో కలిసి ఈ నెల 22వ తేదీ ఉదయం గ్రామంలో జరిగిన ఓ వేడుకకు కూడా హాజరైంది. అనంతరం వారిద్దరూ జామాయిల్‌ తోటల వైపు వెళ్లగా.. అదే గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులు వారిపై దాడి చేశారు. ఇద్దరిపై అత్యాచారం జరపబోగా.. బాలిక స్నేహితురాలు ఎలాగోలా తప్పించుకుని పారిపోయింది.

Recommended Video

దళిత బాలికపై రేప్.. ఆపై హత్య !

అక్కడే చిక్కుకుపోయిన బాలికపై కామాంధులు అత్యాచారం చేశారు. ఆ సమయంలో వారంతా మద్యం మత్తులో ఉన్నట్టు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఘటన అనంతరం స్వగ్రామానికి వెళ్లిపోయిన బాలిక.. కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పింది. దీంతో వారు దమ్మపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

English summary
Seven persons in the age group of 2--25 had allegedly rape a tribal girl in Bhadradri Kothagudem district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X