గంటాపై అయ్యన్న తీవ్రవ్యాఖ్య: సోనియా తప్పఅని కాసు
గంటా సహా పలువురు కాంగ్రెసు ప్రజాప్రతినిధులు తమ పార్టీలోకి వస్తారనేది కేవలం ఊహాగానమే అన్నారు. దొంగలు టిడిపిలోకి వస్తే తమ పార్టీకి నష్టమన్నారు. తమ పార్టీలోకి ఎవరు వచ్చినా విలువలు, నిబద్ధత చూశాకే చేర్చుకుంటామని అయ్యన్న పాత్రుడు అన్నారు.
గంటా ఏ పార్టీలోకి వెళ్లినా ఆ పార్టీ నాశనం అవుతోందన్నారు. కేంద్ర పర్యాటక శాఖమంత్రి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ, ఇప్పుడు కాంగ్రెసు పార్టీలు బలహీనపడ్డాయన్నారు.
సోనియా తప్ప: కాసు
తాను ఏఐసిసి సభ్యుడినని, తనపై తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తప్ప ఎవరూ చర్యలు తీసుకోలేరని మంత్రి కాసు వెంకట కృష్ణా రెడ్డి వేరుగా అన్నారు. రేపటి కేబినెట్ సమావేశం సజావుగానే సాగుతుందని చెప్పారు.
కేంద్రంలో యూపిఏ అధికారంలోకి రావడానికి ఆంధ్ర ప్రదేశ్ కారణమన్నారు. ఇక్కడి నుండి ఎక్కువ పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నామన్నారు. రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లోను జరగదన్నారు. రాయల తెలంగాణకు సీమ ప్రజలు ఒప్పుకోరన్నారు. రాయల తెలంగాణ సరికాదన్నారు.