టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేసిన మంత్రి గంటా
విశాఖపట్నం: ఏపీలో పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేశారు. సప్లిమెంటరీ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం సాయంత్రం ఆంధ్రా యూనివర్సిటీలో విడుదల చేశారు. ఫలితాల విడుదల అనంతరం ఆయన మాట్లాడుతూ పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో విద్యార్థులు 64 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
సప్లిమెంటరీ ఫలితాల్లో బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉందని అన్నారు. మార్కుల జాబితాలను త్వరలోనే ఆయా పాఠశాలలకు పంపిస్తామని మంత్రి గంటా తెలిపారు.
అనంతలో నకిలీ పాస్ పుస్తకాల కేసులో మరో వ్యక్తి అరెస్టు
నకిలీ పాస్ పుస్తకాల తయారీలో మరో వ్యక్తిని అనంతపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. జిల్లాలో ఓ ముఠా భారీగా ఈ నకిలీ పూస్ పుస్తకాలను తయారు చేసి పలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంది.
ఈ కేసులో ఇప్పటిరే పలువురి అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రికి చెందిన రంగనాయకులు రబ్బరు స్టాంపుల తయారీ షాపు నిర్వహిస్తున్నాడు. నకిలీ పాస్ పుస్తకాల తయారీలో రంగనాయకుల ప్రమేయం ఉందని తెలియడంతో నిందితుడిగా అనుమానించిన పోలీసులు అతడిని గురువారం అరెస్ట్ చేశారు.