పద్మావతి-గేదెల రాజుల హత్య: హైదరాబాద్లో గుట్టుగా డీఎస్పీ, అందుకే
విశాఖలో రౌడీ షీటర్ సత్యనారాయణ రాజు అలియాస్ గేదెల రాజు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డిఎస్పీ దాసరి రవిబాబు, క్షత్రియభేరి ఎడిటర్, మేనేజింగ్ డైరెక్టర్ భూపతిరాజు శ్రీనివాసరాజు హైదరాబాదులో ఉన్నట్లుగ
విశాఖ: విశాఖలో రౌడీ షీటర్ సత్యనారాయణ రాజు అలియాస్ గేదెల రాజు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డిఎస్పీ దాసరి రవిబాబు, క్షత్రియభేరి ఎడిటర్, మేనేజింగ్ డైరెక్టర్ భూపతిరాజు శ్రీనివాసరాజు హైదరాబాదులో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది.
మాజీ ఎమ్మెల్యే కూతురుతో సంబంధం, హత్యకు రూ.కోటి, రౌడీషీటర్ హత్య: ఈ డీఎస్పీ మామూలోడు కాదు
వీరు ముందస్తు బెయిల్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఈ నెల 6వ తేదీన గేదెల రాజు హత్య కేసులో దర్యాఫ్తును దాదాపు పూర్తి చేసిన పోలీసు బృందాలు మొత్తం 12 మందిని నిందితులుగా నిర్ధారించాయి.
హత్య జరిగి పది రోజులు అయినా ప్రధాన నిందితులైన రవిబాబు, భూపతిరాజుల వివరాలు తెలియరాలేదు. దీంతో వారు హైదరాబాదులో తిష్టవేసినట్లుగా భావిస్తున్నారు. తన ప్రియురాలు పద్మలత హత్యకు సంబంధించి ఇవ్వాల్సిన డబ్బు విషయంలో వివాదం తలెత్తడంతో గేదెల రాజును డీఎస్పీయే హత్య చేయించినట్లు తమ విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే.