జగన్ కేసు: రిజైన్కు సిద్ధపడ్డ గీతా, చూద్దామన్న సిఎం
అందులో లేపాక్షి నాలెడ్జ్ హబ్ అంశంలో గీతా రెడ్డిని ఎ9 నిందితురాలిగా సిబిఐ పేర్కొంది. దీంతో గీతా రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. తెలంగాణ వస్తే కొత్త రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో గీతా రెడ్డి కూడా ఉన్నారు. జగన్ ఆస్తుల కేసులో అభియోగాలు నమోదు కావడంతో గతంలో సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఆమె మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. తాను రాజీనామా చేస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే, అభియోగ పత్రాన్ని సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాత చూద్దామని ముఖ్యమంత్రి ఆమెకు సర్ది చెప్పారట.
బెయిల్ పైన మోపిదేవి విడుదల
వాన్పిక్ భూముల కేసులో చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మంగళవారం మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు. మోపిదేవి గత కొంతకాలంగా మెడ, వెన్నునొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీంతో మెరుగైన వైద్య చికిత్స కోసం సిబిఐ కోర్టు 45 రోజుల మధ్యంతర బెయిల్ను సోమవారం సాయం త్రం మంజూరు చేసింది.
మంగళవారం బెయిల్ పత్రా లు జైలు అధికారులకు చేరడంతో మోపిదేవిని విడుదల చేశారు. మోపిదేవి విడుదల సందర్భంగా జైలు వద్దకు అతని అనుచరులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. శస్త్రచికిత్స కోసం మోపిదేవి బుధవారం బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చేరనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.