వీడియోపై గిడ్డి ఈశ్వరి తడబాటు: జవాబు దాటవేత
హైదరాబాద్: సాక్షి మీడియా బయటపెట్టిన వీడియోపై సమాధానం చెప్పే విషయంలో శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి తడబడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున శాసనసభకు గెలిచిన ఆమె ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
మంత్రి పదవి కోసమే పార్టీ మారాననే విషయాన్ని ఆమె పరోక్షంగా అంగీకరించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. వీడియోలో మాట్లాడింది మీరేనా అని అడిగితే సమాధానం దాటవేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

వీడియోపై మీడియా ప్రతినిధులు శాసనసభ మీడియా పాయింట్ వద్ద ప్రశ్నలు అడుగుతుండగానే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. పదవుల కోసమే పార్టీ మారారనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుల ఆరోపణలకు కూడా ఆమె జవాబు దాటవేశారు.
మంత్రి పదవి లేదా ఎస్టీ కార్పోరేషన్ పదవి ఇస్తామని ఆశపెట్టి ఈశ్వరిని టిడిపిలోకి తీసుకున్నట్లు తమకు లభించిన వీడియో బయటపెడుతోందని సాక్షి మీడియా రాసింది. డీల్ గురించి స్వయంగా ఈశ్వరి వెల్లడించారని, ఈ విషయంపై కార్యకర్తలతో మాట్లాడుతున్న వీడియో తమకు చిక్కిందని రాసింది.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications