తెనాలిలో మాజీ ప్రియుడిపై యువతి యాసిడ్ దాడి
గుంటూరు: ఓ యువతి తన మాజీ ప్రియుడిపై యాసిడ్ దాడికి పాల్పడింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలిలో గురువారం అర్థరాత్రి జరిగింది. గీతాంజలి అనే యువతి తన మాజీ ప్రియుడు వెంకటేష్పై ఆ దారుణానికి ఒడిగట్టింది.
గీతాంజలికి గతంలోనే వివాహమైంది. అయితే, మనస్పర్థలతో భర్తతో విడిపోయిన గీతాంజలి వెంకటేష్తో సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో ఆమె వెంకటేష్కు దూరమవుతూ మరో వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతూ వచ్చింది.
అది నచ్చని వెంకటేష్ గత రాత్రి గీతాంజలి ఇంటికి వెళ్లాడు. దాంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో గీతాంజలి వెంకటేష్పై యాసిడ్ దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. ఈ దాడిలో గాయపడిన వెంకటేష్ స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స పొందాడు.
ఆ తర్వాత అతన్ని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతనికి ఏ విధమైన ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. గాయాలకు సర్జరీ చేయాలా, ప్లాస్టిక్ సర్జరీ చేయాలా అనే విషయంపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు.