వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలిపటం ఎగరేస్తూ.. డాబాపై నుంచి పడి మృతి, తల్లి కన్నీరుమున్నీరు (ఫోటోలు)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: ఏపీలోని విశాఖలో బుధవారం ఓ ఇంట విషాదం చోటు చేసుకుంది. మేడ పైన గాలి పటం ఎగరవేస్తూ ఓ బాలిక కిందపడి మృతి చెందింది. ఏడాది కిందటే ఆ బాలిక తండ్రి మృతి చెందాడు. ఇప్పుడు బాలిక చనిపోయింది. బాలిక మృతితో ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.

పాత జైలు రోడ్డులోని గొల్లలపాలెం ఆర్టీ క్లబ్ సమీపంలో ఉండే అరుణకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు మానస డాబా గార్డెన్సులోని ప్రేమ సమాజం పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది.

బుధవారం సాయంత్రం సోదరితో కలిసి గాలిపటాలు ఎగరవేసేందుకు ఇంటి మేడ పైకి వెళ్లింది. పాలిథీన్ కవర్‌కు దారం కట్టి గాలిపటంలా ఎగరవేసుకుంటూ.. ముందుకు పోయింది. ఆ పాలిథీన్ కవర్ విద్యుత్ స్తంభం తీగలకు చుట్టుకుంది. దంతో దానిని తప్పించేందుకు వెనక్కి వెళ్లిన మానస మేడ పై నుంచి కిందపడింది.

Girl falls to her death in Vishaka

అడుగు ఎత్తు మాత్రమే ఉన్న పిట్టగోడ పై నుంచి కిందపడింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు, తల్లి అరుణ కలిసి మానసను కెజిహెచ్ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అప్పటికే మానస మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

కాగా, అరుణ భర్త ఏడాది కిందటే అనారోగ్యంతే మృతి చెందాడు. అరుణ ఇంటి వద్దే పాన్ షాప్ పెట్టుకుంటూ పిల్లల్ని పోషించుకుంటోంది. కూతురు మృతదేహం వద్ద అరుణ కన్నీరుమున్నీరయింది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేకపోయింది.

English summary
Girl falls to her death in Vishakapatnam on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X