యువతిపై రేప్యత్నం: ప్రేమ వ్యవహారమా? (పిక్చర్స్)
హైదరాబాద్: సికింద్రాబాదు చిలకలగూడలో పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం నలుగురు యువకులు ఓ యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. ఇందులో మరో కోణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రేమ వ్యవహారం కూడా ఉండి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిందితులు నలుగురిని ఇసాక్, షఖీల్, ఇస్మాయిల్, షౌకత్లుగా ఫిర్యాదు చేశారు. నిందితుల్లో ఒకడిగా భావిస్తున్న ఇసాక్తో సదరు యువతికి ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. వీరిద్దరు ఫోన్లో మాట్లాడుకుంటున్ట్లు, తరుచూ కలుసుకుంటున్నట్లు తెలుస్తోంది.
వీళ్లు బుధవారం కలుసుకొని ఉండవచ్చునని, అప్పుడు వాగ్వాదం జరిగి ఉండవచ్చునని, ఆ సమయంలోనే ఇసాక్ తన మిత్రులతో కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడనే కోణంలోను దర్యాఫ్తు చేస్తున్నారు. సాయంత్రం ఇసాక్ను అదుపులోకి తీసుకున్నారు. తనకు ఆమె ఫోన్ చేస్తే కట్ చేశానని ఆయన చెప్పారు. వారు పలుమార్లు మాట్లాడుకున్నట్లుగా కాల్ లిస్టులో బయటపడింది.
యువతి 1
సికింద్రాబాదులోని చిలకలగూడలో యువతి పైన అత్యాచారయత్నం చేసి, నిప్పు అంటించిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న చిలకలగూడ పోలీసులు
యువతి 2
సికింద్రాబాదు చిలకలగూడలో పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం నలుగురు యువకులు ఓ యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే.
యువతి 3
సికింద్రాబాద్లోని చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ సమీపంలో దారుణం జరిగింది. ఓ యువతిపై కొంతమంది గుర్తు తెలియని దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. స్థానికులను పోలీసులు విచారిస్తున్న దృశ్యం.
యువతి 4
ఆమెకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో ఉన్న ఆమె మంటలతోనే వీధిలోకి కేకలు పెడుతూ వచ్చిందని, దాంతో చుట్టుపక్కల వారు మంటలు ఆర్పే ప్రయత్నం చేసి, తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
యువతి 5
చిలకలగూడ బస్తీలో ఉంటున్న ఇరవై రెండేళ్ల యువతి తన తల్లి, తమ్ముడితో కలిసి ఉంటోంది. బుధవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో ఫోన్ రావడంతో ఆమె బయటకు వెళ్లారు. అనంతరం బస్తీ సమీపంలోని రైల్వే క్వార్టర్సులో ఒంటిగంట సమయంలో ఒంటిపై మంటలతో కాలిపోతూ కేకలు వేయడంతో స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.
యువతి 6
నిందితులు నలుగురిని ఇసాక్, షఖీల్, ఇస్మాయిల్, షౌకత్లుగా ఫిర్యాదు చేశారు. నిందితుల్లో ఒకడిగా భావిస్తున్న ఇసాక్తో సదరు యువతికి ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు.
కాగా, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలగూడ బస్తీలో ఉంటున్న ఇరవై రెండేళ్ల యువతి తన తల్లి, తమ్ముడితో కలిసి ఉంటోంది. బుధవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో ఫోన్ రావడంతో ఆమె బయటకు వెళ్లారు. అనంతరం బస్తీ సమీపంలోని రైల్వే క్వార్టర్సులో ఒంటిగంట సమయంలో ఒంటిపై మంటలతో కాలిపోతూ కేకలు వేయడంత ోస్థానికిలు ఆమెను ఆసుపత్రికి తరలించారు.
తనను నలుగురు యువకులు రమ్మని పిలిచారని, వెళ్లగానే అత్యాచారం చేసేందుకు యత్నించగా ప్రతిఘటించానని యువతి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇసాక్, షఖీల్లను అదుపులోకి తీసుకున్నారు.