ప్రతిపక్ష నేత చంద్రబాబుకి ఛాన్స్ ఇవ్వండి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిటిషన్ పై హైకోర్టు స్పందించింది. స్టేట్ సెక్యూరిటీ కమీషన లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్టేట్ సెక్యూరిటీ కమిషన్లో ప్రతిపక్ష నేతగా తనకు స్థానం లేకపోవడంపై చంద్రబాబు కోర్టు మెట్లెక్కారు . పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది ఏపీ హైకోర్టు.
తక్షణం ప్రతిపక్షనేత చంద్రబాబు పేరు స్టేట్ సెక్యూరిటీ కమీషన్ లో నమోదు చేస్తూ నెల రోజుల్లో జీవో ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు ధర్మాసనం.ప్రతిపక్ష నేత పేరు స్టేట్ సెక్యూరిటీ కమీషన్ లో లేకపోవడం సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
హైకోర్టు చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్ కు అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చెయ్యటం ఏపీ ప్రభుత్వానికి షాక్ అనే చెప్పాలి .