వుమెన్స్ డే-బడ్జెట్: ఏపీ మహిళలకు బాబు శుభవార్త, సగం ధరకే శానిటరీ ప్యాడ్స్
Recommended Video
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మహిళలకు రాష్ట్ర బడ్జెట్లో శుభవార్త. డ్వాక్రా మహిళలకు శానిటరీ నాప్కిన్ల కోసం రూ.,100 కోట్లు బడ్జెట్లో కేటాయించారు.
శానిటరీ నాప్కిన్లను ప్రభుత్వం త్వరలో సగం ధరకే ఇవ్వనుంది. గురువారం మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా చంద్రబాబు మహిళలకు శుభాకాంక్షలు చెప్పారు.
యనమల రామకృష్ణుడు ప్రవేశ పెట్టిన పూర్తి బడ్జెట్ వివరాలు
Good news for #Andhra women: Govt to slash #sanitarypad price by half
— ANI Digital (@ani_digital) March 8, 2018
Read @ANI story | https://t.co/go6LiDBHW6 pic.twitter.com/kxG5MLjEUw
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, కొత్తగా పుట్టిన వారి ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు తమ ప్రభుత్వం ఆధునిక విధానం తీసుకు వచ్చామన్నారు.
మహిళల కోసం తాము ఎన్నో పథకాలు తెచ్చామని అన్నారు. ఇందులో భాగంగా శానిటరీ ప్యాడ్స్ను సగం ధరకే ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. త్వరలో దీనిని అమలు చేస్తామన్నారు.