ప్రియురాలిని నమ్మించి గొంతుకోసి చంపాడు
చీరాల: ప్రకాశం జిల్లా పాత చీరాలకు చెందిన ఎంటెక్ విద్యార్థిని తేజను ప్రేమికుడు గోపిచంద్ గొంతుకోసి శనివారం రాత్రి హత్య చేశాడు. గోపిచంద్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు.చీరాలలోని టీవీఎస్ షోరూంలో తేజ పనిచేస్తోంది.
ప్రకాశం జిల్లా పాత చీరాలకు చెందిన తేజ, రామానగర్కు చెందిన ఆటో డ్రైవర్ గోపిచంద్తో రెండేళ్ళుగా ప్రేమించుకొంటున్నారు.
ఈ క్రమంలో గోపిచంద్ శనివారం రాత్రి 7 గంటల సమయంలో తేజను రామానగర్లోని తన మేనమామ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తాళం వేసి ఉండడంతో వెనుక నుండి తలుపును పగులగొట్టి లోనికి వెళ్ళారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏం జరిగిందో అర్ధం కాలేదు.
తేజను గొంతుకోసి గోపిచంద్ పారిపోయాడు. ఈ విషయాన్ని గోపిచంద్ తన స్నేహితులకు సమాచారమిచ్చాడు. గోపిచంద్ స్నేహితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు.
నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు. రెండేళ్ళుగా ప్రేమించుకొంటున్న వారిద్దరి మధ్య ఏం జరిగిందో అర్ధం కావడం లేదంటున్నారు స్నేహితులు. తేజను చంపాల్సిన మనస్పర్థలు కూడ వారి మధ్య లేవంటున్నారు గోపిచంద్ సన్నిహితులు.