చంద్రబాబుకు పైలట్, ఎస్కార్ట్ వాహానాల తొలగింపు..
అసెంబ్లీ జరిగే మొదటి రోజే చంద్రబాబుకు షాక్ ఇచ్చింది అధికార వైసీపీ, ఈనేపథ్యంలోనే జడ్ ప్లస్ కేటాగిరి భద్రతలో చంద్రబాబు కాన్వాయ్లో పైలట్ ,ఎస్కార్ట్ వాహానాలను తోలగించింది. దీంతో వాహనాల తగ్గింపుపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సెక్యూరిటీ వ్యవహారాల కమీటితో చర్చించాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు.
చంద్రబాబు కాన్వాయ్లో ముందుండి ట్రాఫిక్ రూట్ను క్లియర్ చేసుకుంటూ వెళ్లే పైలట్ తోపాటు చంద్రబాబు కాన్వాయ్ వెనకాల వచ్చే ఎస్కార్ట్ వాహానాన్ని తోలగించారు. కాగా చంద్రబాబు కాన్వాయ్లో ఎదైన వాహానానికి సమస్య తలెత్తితే ముందు జాగ్రత్త చర్యగా ఎస్కార్ట్, మరియు పైలట్ వాహానానాలు ఉంటాయి. ఈనేపథ్యంలోనే వాటిని ప్రభుత్వం తొలగించింది.
దీంతో నేడు అసెంబ్లీకి చేరుకున్న చంద్రబాబు పైలట్ ఎస్కార్ట్ వాహానాలు లేకుండానే వచ్చాడు. దీంతో చంద్రబాబు భద్రతపై పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న నేపథ్యంలో కూడ అదే కాన్వాయ్ కూడ ఉండేదని ప్రస్థుతానికి చంద్రబాబుకు నాయుడుకు కూడ ఇదే సెక్యూరిటిని ఏర్పాటు చేశామని చెబుతున్నారు.కాగా 2019లో ఎన్నికల్లో ఓటమీ పాలైన చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే జడ్ ప్లస్ కేటాగిరి ఉన్న చంద్రబాబు భద్రతను ఎలా తగ్గిస్తారని వైసీపీ ప్రశ్నిస్తుంది.